Sunday, October 9, 2016

వైయ్యక్తికం నుంచి సామూహికం దాకా విస్తరించిన కవిత్వం - ఎం. నారాయణ శర్మ

కవిత్వం భౌతికమా? అభౌతికమా? అధి భౌతికమా? అన్న ప్రశ్నలకు ఏదో ఒక కవితనో, కావ్యాన్నో పట్టుకుని అది పైవాటిలో ఏ మార్గానికి చెందుతుందో చెప్పవచ్చు. లేదా కొందరు కవుల కవిత్వాన్ని విశ్లేషించి నిర్ణయించవచ్చు. కాని అన్ని కాలాల్లో అన్ని మార్గాల కవిత్వానికి వర్తించే అంశాన్ని నిర్ణయించడం కష్టం. దానికి కారణం ఈ మూడు కవిత్వాన్ని ఎక్కడో ఒక చోట పెనవేసుకుని ఉండటం. ఆకెళ్ళ రవిప్రకాష్‌ లాంటి వాళ్ళకవిత్వాన్ని చూసినప్పుడు ఈ అంశం పున:రూఢి అవుతుంది కూడా...
ప్రాచీన కావ్యమీమాంస అలౌకిక వ్యాపారాలను గురించి చెప్పింది. సాధారణ, ధారణ, మనన, చర్వణ, సృజన అనేవి అలౌకిక వ్యాపారాలు. సాధారణ ఒక భౌతిక దృశ్యం, ధారణ భౌతికంలోంచి తీసుకున్న దృశ్యాంశం. మనన దృశ్యపు పునరావృత్తి. చర్వణ పునరనుభవం. సృజన కళాత్మక వ్యాపారం. ఈ ఐదు దశలో పాఠకుడికి చేరేది సృజన. మిగతా నాలుగు దానికి పూర్వాంశాలు. భౌతిక, అభౌతిక, అధిభౌతిక మార్గాల్లో చూస్తే మొదటి రెండు భౌతికానికి, మధ్య రెండు అభౌతికానికి, చివరి అంశం అధిభౌతికానికి చెందింది. అయినా వీటికి భౌతికమే పాదం. అనేక వలయాలు వలయాలుగా కళగా, సృజనగా ఆకెళ్ళ రవిప్రకాష్‌లో వ్యక్తమౌతున్నవి కూడా ఇవే. అనేకసార్లు పరిపూర్ణమైన సృజన దశలో. ఒకింత అస్పష్టంగా, కొన్ని స్పష్టమైన భౌతికాంశాలుగా కనిపించడంలోని కారణమూ ఇదే. 
ఈ కవిత్వంలో గమనింపదగిన అంశాలు కొన్ని ఉన్నాయి. భౌతికాంతరత (జూష్ట్రyరఱషaశ్రీ ణఱర్‌వఅషవ) ఎడ్వర్డ్‌ బుల్లో ప్రతిపాదించిన ఈ కళా సిద్ధాంతం. భౌతిక వాతావరణంలోని నిరాసక్తతను ఆసక్తివైపుకి, నిశ్చేష్టను చైతన్యం వైపుకి మరలుస్తుంది. అనేక కవితల్లో ఈ అంశం వెల్లడి అవుతుంది. ఈ కవిత్వానికి 'నగరం' ఒక కేంద్రం. కాని ఇందులో కోల్పోతున్న దాన్ని పొందాలనే సంఘర్షణ. నిరాపేక్షంగా వర్తమానాన్ని అనుభవించడం ధ్వనిస్తుంది. ప్రధానంగా స్వేచ్ఛను కోరుకునే, ప్రతిపాదించే, సమర్థించే గొంతుక స్పష్టంగా కనిపిస్తుంది. శైలీగతంగా దర్శనాన్ని చూస్తే రవిప్రకాష్‌ ఏ దృశ్యాన్ని కత్తిరించుకోరు. ఏ అంశాలు ఎదురైతాయో వాటిని అంతే ఆప్యాయంగా అనుభవిస్తారు.
''సాగన్‌/ న్‌ అనేకానేక మలుపుల్లోకి / దేవతల సాక్షిగా / నన్ను నేను వెతుక్కుంటూ/ నన్నీ ఇసక రేణువుల్లో ఒకటిగా స్పృశించు'' (విన్నపాలు వినవలె - 68పే. ప్రేమ ప్రతిపాదన)
''ఉదయం మళ్ళీ / ఉన్నట్టుండి మళ్ళీ మొదలవుతుంది / ఇక ఈ మట్టిమీద మొదటిసారి / అడుగుపెట్టిన క్షణపు / జ్ఞాపకాలన్నీ నన్ను చుట్టుముడతాయి''
- (వర్షంలో నగరం - 24పే. - ప్రేమ ప్రతిపాదన)
'ఈ నిరంతర ప్రయాణంలో / ఇది ఎన్నో మజిలీయో గుర్తులేదు / అదే అపరిచిత జ్ఞాపకంలోకి / మళ్ళీ మళ్ళీ సాహసం/ వలయాలు వలయాలుగా సాగే ప్రయాణం''
- ( అపరిచిత జ్ఞాపకం - పే 22. ఇసకగుడి)
ఇసుక రేణువుల్లో ఒకటిగా ఉండటం, జ్ఞాపకాలు చుట్టుముట్టడం, వలయాలు వలయాలుగా ప్రయాణం ఇవన్నీ రసానుభూతి (Aవర్‌ష్ట్రవ్‌ఱష టవవశ్రీఱఅస్త్ర)ను ప్రకటిస్తున్నాయి. బుల్లో సిద్ధాంతాన్ని ఉదహరిస్తూ సంజీవదేవ్‌ ''రసానుభూతికి ఉపయోగంతో సంబంధం లేద''ని చెప్పారు. ఈ వాక్యాల్లో వర్తమానం, దానితోపాటు గతం, గతానుగతాన్ని అనుభవించడం కనిపిస్తుంది. ఈ అనుభవాన్ని రవిప్రకాష్‌ భౌతికాన్నుంచేదుకుంటారు. 
వైయ్యక్తికం, సామూహికం వేరుకానట్టే, భౌతికం, మానసికం వేరు కాదు. మానవ సంస్కృతి ఒక జీవన భాగాన్ని అనుభవిస్తుంది. అది తను జీవించే కాలానికి కాస్త ముందు, వెనకలుగా విస్తరించి అర్థం చేసుకుంటుంది, తనను అందులో సంలీనం చేసి, ఆ వాతావరణాన్ని తనలో సంలీనం చేసుకుంటుంది. మనో వైజ్ఞానిక శాస్త్రం ఈ సాంస్కృతిక సాపేక్షతా సిద్దాంతాన్ని పరిచయం చేసింది .కళ, సాహిత్యం, సంగీతం, యాంత్రిక కల్పనలు అవి పుట్టిన సంస్కృతి నుంచే అంచనా వేయగలం గాని, కేవలార్ధంతో విలువలను నిర్ణయించలేమని ఈ వాదం చెప్పింది. ఈ నిర్ణయానికి ఒక సమూహం ఆధారం. మనో విశ్లేషణలో సాంస్కృతిక సమూహం అనే పదాన్ని వాడుతారు. ఒక సమూహంగా విశిష్టంగా పరిగణింపబడే ప్రజాసమూహం. ఆకెళ్ళ కవిత్వంలో ఈ అంశం కనిపిస్తుంది. ఇలాంటి సమూహాలకు సంబంధించిన పాత్రలను పరిచయం చేయడం అనేక చోట్ల కనిపిస్తుంది.
1. ''అన్ని మజిలీలు పూర్తి చేసుకుని / చివరి తీరాన్ని వెదుక్కుంటూ / ఇక్కడ ఉదయిస్తాడు అరవిందుడు''
2. ''అంతే పరధ్యానంగా / తనవంకే చూస్తున్న సముద్రాన్ని / తుదకంటూ యీది / ఇక్కడే అస్తమిస్తాడు అరవిందుడు'' - (పే. 28. ఇసక గుడి)
3. ''విగ్రహ మాత్రంగా మిగిలిపోతాడు గాంధీ''
4. ''సుబ్రహ్మణ్య భారతి కూడా / అలా అక్షరాలను పేర్చుకుంటూ అలా అపరిచితంగా వెళ్ళిపోయి ఉంటాడు''
( అపరిచిత జ్ఞాపకం - పే. 29 - ఇసకగుడి)
5. ''ఒక మహా గాయకుడు ప్రత్యక్షమౌతాడు / ఒక మహా చక్రవర్తి హుంకరిస్తాడు / ఒక ఆదిమ మానవుడు నృత్యం చేస్తాడు / అలక్‌ నిరంజన్‌ నుంచి బౌద్ధ భిక్షువు దాక / అందరూ వాళ్ళ కథలు చెప్పుకుని వెళ్ళిపోతారు''
- (కవిత్వం కురిసిన రాత్రి - 84పే. ఇసకగుడి)
6. ''ఇప్పుడే చెట్టు వర్షం కురిసినప్పుడల్లా / స్మృతుల్ని మనందరి మీదా చిలకరిస్తుంది'' - (వర్షంలో చెట్టు పే. 91)
7. ''కవి భౌతికంగా మరణించి / నా లోపలి ప్రేమలోకి జన్మనెత్తాడు / స్పటిక చంద్రుడే. ఆకురాలిన చెట్టు కొమ్మల్నీ / నా గది కిటికీలోంచి చూస్తూ సముదాయిస్తాడు'' - (అనంతం - 39 - ప్రేమ ప్రతిపాదన)
ఈ వాక్యాలు ఎక్కువ వరకు కవులకు, వాళ్ళ జీవితాలకు కవిత్వానికిసంబంధించినవే. ఐదవ వాక్యాంశాలు అనిర్దిష్టంగా విశ్వభావనను కలిగిస్తాయి. చివరి రెండు పరోక్షంగా 'ఇస్మాయిల్‌'ను చూపుతాయి. ఆకెళ్ళ కవిత్వంలో ఇలాంటివి అధికం. సుమారుగా నగరం, ఊరు, కొందరు వ్యక్తులు మినహాయించి ఇతరత్రా ఉండే కవిత్వం చాలా తక్కువ. ఓ మహాత్మా (27), కిషోర్‌ నీ పాట (27), చరఖా సంగీతం (84), దీపశిఖ (104), ద్విఖండిత (29), పాతగాయం (72) మొదలైన 'ప్రేమ ప్రతిపాదన'లోని కవితలు. నిరంతర యాత్ర (95) కవిత్వం కురిసిన రాత్రి, వర్షంలో చెట్టు (95) మొదలైన ఇసకగుడిలోని కవితలు ఈ మార్గానికి చెందినవే. నిజానికి వీళ్ళందరి ఊహల్లోకి జీవితాల్లోకి, మార్గాల్లోకి, ప్రవర్తనల్లోకి సాంస్కృతిక సాంశీకరణ (షబ్‌బతీaశ్రీ aరరఱఎఱశ్రీa్‌ఱశీఅ) చెందుతారు కవి. వాళ్ళనను ఆహ్వానిస్తారు. నగరాలు, సముద్రం అందుకు మినహాయింపు కాదు. వీటిలో కనిపించే సాంశీకరణ, అధి స్వదేశీయత (ఎవ్‌a అశీర్‌aశ్రీస్త్రఱa) లక్షణాల్లో కనిపిస్తుంది.
నిర్మాణగతంగా ఆకెళ్ళ కవిత్వం అధిభౌతికంగా, భౌతికంగా (జూష్ట్రyరఱషaశ్రీ)గా, కళా వాతావరణాన్ని ఆనుకుని కొన్నిసార్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు వర్తమానాన్ని, కాలాన్ని దాటి మాట్లాడటం వల్ల ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. కాలాన్ని వర్తమానాన్ని దాటడం అంటే ఒక్కోసారి గొంతుక జన్మకు కూడా దాటి పురాస్మృతుల నుంచి మాట్లాడుతున్నట్టుగా అనిపించడం వల్ల ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. నిజానికి ఇది ఊహ మాత్రమే. ఫ్రాయిడ్‌ మనసుకు మూడు అంతరాలు అహం (వస్త్రశీ) బుద్ధి (రబజూవతీ వస్త్రశీ) చిత్తం (ఱస) ఉంటాయని వాటిలో కళ చిత్తం నుంచి అతార్కికత, అదృశ్యశక్తిని పొందుతుంది. దీన్ని ప్రేరణ అంటున్నాం. ఐక్యత, గుణీకరణలను అహం నుంచి, ఆధ్యాత్మిక ఆశయాలు, ఆదర్శాలను బుద్ధి వల్ల పొందుతుంది. ఆధ్యాత్మికత కనిపించడం బుద్ధి వల్లనే. కవిత్వ కళలో కనిపించే భావావేశ స్థితి (ఱఅరజూఱతీa్‌ఱశీఅ) చుట్టూ ఒక దివ్యానందం అంగీకారం, తిరస్కారం ఇవన్నీ ఉన్నాయి. ఆకెళ్ళలోనూ అందుకు ఉదాహరణలున్నాయి. ఇవి సందర్భగతమైనవి.
''అలా నెమ్మదిగా ఉదయాల్లోకి సాగిపో / చేప నీళ్ళలోనే ఉండనీ / పళ్ళని చెట్టుకే మిగలనీ / ఎవరికీ కరచాలనం చెయ్యకు'' (ఇసకగుడి. పే. 16)
''ఒక్కసారి మనసంతా అంధకార బంధురమయిపోతుంది // ఒకటే నిస్సహాయత ఒకటే దైన్యత'' - (కనబడని రేఖా చిత్రం - 35. ఇసకగుడి)
''కాశ్మీర్‌ అయితేనేం కాందహార్‌ అయితేనేం / సరిహద్దుల్ని అతిక్రమిస్తాయి కాబట్టి / పక్షులంటే ఇష్టం నాకు'' 
- (ప్రేమ ప్రతిపాదన - 1 పే)
ఈ వాక్యాలు అంగీకార తిరస్కారాలను ప్రసారం చేస్తాయి. వాక్యాలను అలంకారికంగా చెప్పడం, ధ్వన్యాత్మకంగా చెప్పడం లాంటి అంశాల్లోనూ వైవిధ్యం ఉంటుంది. అలాంటి వాక్యాలు అనేకంగా ఏరి రాయవచ్చు. చాలాసార్లు నగరాన్ని 'సముద్రం' 'ఆమె (స్త్రీ)' అనే ప్రతీకల ద్వారా చిత్రిస్తారు. రెండు భిన్న కాలాలు ఉంటాయి. ఒక రాత్రి కాలం లేదా ఉదయం. ''రాత్రి, సూర్యుడు, ఉదయం సముద్రం. మూసిన కళ్ళు'' ఇలాంటి సంకేతాంశాలు అన్నీ ఒక ఆర్కిటైపికల్‌ ఎట్మాస్పియర్‌ని కవిత్వానికిస్తాయి. కొన్నిసార్లు ఊహలు, భావ చిత్రాలు కళాత్మక దృష్టిని ప్రసారం చేస్తాయి. 
''ఆకాశం కాగితం మీద మబ్బుల్ని / రచిస్తుంటాయి కొబ్బరి చెట్టు / ఒకరెక్క ఇటు వాల్చి / సముద్రం స్తనాల మీద / తల వాల్చుకు పడుకుంటాయి పడమటి కొండలు''
- (నుదుటిమీద సూర్యోదయం - 80 పే. ఇసకగుడి)
''ఇక్కడ ఆకాశం కాన్వాసు మీదగా ఎగిరే / ఓ తెల్ల కొంగల బారు / సాయంత్రపు మబ్బు తునకల్ని మోసుకొస్తుంది''
- (నదీముఖద్వారం - 77పే.)
సాధారణంగా కళా సౌందర్యం రెండు శ్రేణుల నుంచి కవి గ్రహిస్తాడు. 1. సేంద్రియ (శీతీస్త్రaఅఱష) ప్రాణుల్లో గోచరించేది. 2. నిరింద్రియ (ఱఅశీతీస్త్రaఅఱష) ప్రాణేతరాలయిన నదులు, కొండల్లో కనిపించేది. రెండు వైపుల నుంచి కవులు భావ చిత్రాలను అందిస్తారు. ఆకెళ్ళ దీనికి మినహాయింపు కాకపోయినా రెంటి మధ్య బలమైన సంబంధాన్ని సృజన ద్వారా కలిగించడం కనిపిస్తుంది. కాలరిడ్జ్‌ ''ప్రకృతిలోని రూపాలనెంత నిర్దుష్టంగా కాపీ చేసినా, శబ్దాత్మకంగా చెప్పినా అవి విలక్షణతను చెప్పవు. బలమైన కోరిక చేత అవి మార్పు చేయబడితేనే అది అతని ఊహాశాలితకు నిదర్శనం' అన్నాడు. ఈ సేంద్రియ, నిరింద్రియ కళలకు, సౌందర్యానికి మధ్య వ్యత్యాసాన్ని దూరం చేసే మార్పు పై వాక్యాల్లో ఉంది. క్రియలను వైవిధ్యంగా కూర్చడం వల్ల ఈ గుణారోపణ సాధ్యమయింది. చివరి వాక్యాల్లో రోడ్డును భిన్న కోణాల్లో నిర్వచించడంలోనూ ప్రతిభా సమన్వయం కనిపిస్తుంది.
వస్తుగతంగా, శిల్పగతంగా, కళాగతంగా సాధారణ కవితా స్రవంతి నుంచి ఆకెళ్ళ రవిప్రకాష్‌ కవిత్వం తన ఉనికిని నిలబెట్టుకుంటుంది. శైలి, మనో వైజ్ఞానిక భూమికల ఆధారంగా విశ్లేషణ ముందుకెళితే ఈ తరహా కవుల అభివ్యక్తి లోతుల్ని మరింతగా అర్థం చేసుకోవచ్చు.
- ఎం. నారాయణ శర్మ, 9177260385